కమ్యూనిస్టు భావజాలమున్న టి. కృష్ణ తన చిత్రాలకు తానే కథను తయారు చేసుకునేవారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ సామాజిక సందేశం ప్రధానంగా సాగినవే. అంతర్లీనంగా సమసమాజం లక్ష్యంగా, అవినీతి,పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా ఆయన చిత్రాలు రూపొందేవి. అయినా వాటిని అన్ని వర్గాలనూ మెప్పించేలా, కమర్షియల్గా విజయవంతమయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడిగా ఆయన ప్రతిభ కనిపిస్తుంది. దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన, రేపటి పౌరులు వంటి చిత్రాలన్నీ ఈ రకమైన కథాంశాలతో కూడినవే. వీటిలో ఎక్కువ శాతం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించినవే. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్పై రామోజీరావు నిర్మించిన ప్రతిఘటన చిత్రం కూడా టి. కృష్ణ దర్శకుడిగా తెరకెక్కిందే. నేరపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా రూపొందించిన ప్రతిఘటన చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రం హిందీలోనూ రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే డాక్యుమెంటరీని కూడా టి.కృష్ణ నిర్మించారు. ఈతరం ఫిలింస్ బ్యానర్కు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. కేన్సర్ వ్యాధి బారినపడి 1986లో 36 ఏళ్ల చిన్న వయసులోనే చనిపోవడంతో టాలీవుడ్లో టి. కృష్ణ శకం ముగిసింది.
కమ్యూనిస్టు భావజాలమున్న టి. కృష్ణ తన చిత్రాలకు తానే కథను తయారు చేసుకునేవారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ సామాజిక సందేశం ప్రధానంగా సాగినవే. అంతర్లీనంగా సమసమాజం లక్ష్యంగా, అవినీతి,పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా ఆయన చిత్రాలు రూపొందేవి. అయినా వాటిని అన్ని వర్గాలనూ మెప్పించేలా, కమర్షియల్గా విజయవంతమయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడిగా ఆయన ప్రతిభ కనిపిస్తుంది. దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన, రేపటి పౌరులు వంటి చిత్రాలన్నీ ఈ రకమైన కథాంశాలతో కూడినవే. వీటిలో ఎక్కువ శాతం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించినవే. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్పై రామోజీరావు నిర్మించిన ప్రతిఘటన చిత్రం కూడా టి. కృష్ణ దర్శకుడిగా తెరకెక్కిందే. నేరపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా రూపొందించిన ప్రతిఘటన చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రం హిందీలోనూ రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే డాక్యుమెంటరీని కూడా టి.కృష్ణ నిర్మించారు. ఈతరం ఫిలింస్ బ్యానర్కు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. కేన్సర్ వ్యాధి బారినపడి 1986లో 36 ఏళ్ల చిన్న వయసులోనే చనిపోవడంతో టాలీవుడ్లో టి. కృష్ణ శకం ముగిసింది.