యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో తన పాపులారిటీని పెంచుకున్నాడు. ప్రభాస్ కూడా బాహుబలి సినిమాతో వచ్చిన ఇమేజ్ ను అలాగే కంటిన్యూ  చేయాలనే ఉద్దేశంతో వరుస పాన్ ఇండియా సినిమాలను, అంతకుమించిన సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రభాస్ ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించి, అదే స్థాయిలో విడుదల కూడా చేశాడు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల కంటే కూడా హిందీ ప్రేక్షకులనే ఎక్కువగా ఆకట్టుకుంది.  అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ప్రభాస్సినిమా ఒప్పుకున్నా ఆయనకున్న ఇమేజ్ దృష్ట్యా ఆ మూవీని జాతీయ స్థాయిలో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా బడా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఆయనపై చేసిన కామెంట్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఆనందాన్ని కలుగజేస్తున్నాయి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే రేంజ్ మామూలుగా ఉండదని అంటున్నారు ఆ మూవీ నిర్మాత అశ్వనీదత్. ఈ మూవీని పాన్ ఇండియా మూవీ గానే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని తెలుస్తుండగా తాజాగా ప్రభాస్ రేంజ్‌ని ఆకాశానికెత్తారు అశ్వినీదత్. ప్రస్తుతం హాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆరాదీస్తున్న ఏకైక నటుడు ప్రభాస్ అని, ప్రాజెక్ట్ కే మూవీ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోతుందని అశ్వినీదత్ అన్నారు. ఇక ప్రభాస్ అన్ని ఇంగ్లీష్ మూవీస్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కే మూవీలో హై ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో పాటు అమితాబ్, దీపికా పదుకొణె వంటి భారీ తారాగణాన్ని చూడబోతున్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: