రాధే శ్యాం తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఆదిపురుష్, సలార్. ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న ఆదిపురుష్ రామాయణం కథతో వస్తుండగా సలార్ సినిమా కె.జి.ఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తుంది. కె.జిఎఫ్ నిర్మాతమే ఈ సినిమాను నిర్మించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇదిలాఉంటే సలార్ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సలార్ సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోతుందట. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సీన్ తోనే చొక్కాలు చిరిగిపోయేలా చేఏస్తాడట ప్రశాంత్ నీల్.

కె.జి.ఎఫ్ సినిమాతో హీరో ఎలివేషన్ ఏ రేంజ్ లో చేస్తాడో ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ తో కూడా అది ప్రూవ్ చేశాడు. కె.జి.ఎఫ్ 2 భారీ అంచనాలతో వస్తుంది. ఈ సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్న కె.జి.ఎఫ్ 2 రిలీజ్ కాగానే ప్రశాంత్ నీల్ పూర్తి ఫోకస్ సలార్ మీద పెడతారని తెలుస్తుంది. ప్రభాస్ కూడా సలార్ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. తన ఫ్యాన్స్ కు ఈ సినిమా సూపర్ మాస్ ట్రీట్ ఇస్తుందని నమ్ముతున్నారు.

రాధే శ్యాం లవ్ స్టోరీతో క్లాసిక్ గా వస్తుండగా సలార్ సినిమా మాత్రం మాస్ ఆడియెన్స్ కు అదిరిపోయే ట్రీట్ అందించేలా ఉంది. తప్పకుండా సలార్ తో ప్రభాస్ సంచలనం సృష్టించేలా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రజేక్ట్ కె సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ప్రాజెక్ట్ కె సినిమాను వైజయంతి మూవీ బ్యానర్ లో అశ్వనిదత్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సలార్, ప్రాజీక్ట్ కె తో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేయడం షురూ అని తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: