‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తరువాత చిన్న గ్యాప్ తీసుకుని రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తాడని ఇప్పటి వరకు అందరూ అనుకుంటూ ఉన్నారు. స్వయంగా జక్కన్న కూడ ఈవిషయమై స్పందిస్తూ మహేష్ తో చేయబోతున్న సినిమాకు సంబంధించి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరుపుతున్నట్లు లీకులు కూడ ఇచ్చారు. దీనితో ఈ సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం కావడం ఖాయం అని అనుకున్నారు అంతా.


అయితే ఇప్పుడు ఈ ప్లాన్ రివర్స్ అవుతుందా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్నాయి. దీనికి కారణం ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన వెంటనే రాజమౌళి ఒక హిందీ సినిమాను తీసే ఉద్దేశ్యంలో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ఒక లవ్ స్టోరీ తీయాలని రాజమౌళి ఆలోచనలు చేస్తూ దీనికి సంబంధించిన కథా చర్చలలో ఉన్నట్లు టాక్.


ఆమధ్య ‘బ్రహ్మస్త్ర’ మూవీ ప్రమోషన్ ఫంక్షన్ లో రణబీర్ కపూర్ రాజమౌళిలు కలిసినప్పుడు వారిద్దరూ కలిసి ఒక బాలీవుడ్ మూవీ చేసే చర్చలు జరిగాయని ఈవిషయమై రాజమౌళి కూడ ఆశక్తి కనపరచడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన తరువాత జక్కన్న రణబీర్ కపూర్ తో ఒక సినిమా చేయడం ఖాయం అంటున్నారు. ఈవిషయమై అలియా భట్ కోరిక పై రాజమౌళి రణబీర్ తో ఒక మూవీ చేయడానికి సుముఖత వ్యక్తం చేసాడు అంటున్నారు.


ఈ వార్తలే నిజం అయితే రాజమౌళి మహేష్ ల మూవీ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యే ఆస్కారం ఉందని లీకులు వస్తున్నాయి. వాస్తవానికి మాహేష్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ తరువాత మరొక మూవీని లైన్ లో పెట్టుకోకుండా రాజమౌళి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు రాజమౌళి రణబీర్ ల మూవీ ఫైనల్ అయితే మహేష్ చాలాకాలం రాజమౌళి కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి..  



మరింత సమాచారం తెలుసుకోండి: