ఆ విశేషాలివి...
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా వింటున్న పదం లేదా రాస్తున్న పదం కరోనా! టాలీవుడ్ ను ఈ భూతం మరింత భయపెడుతోంది.కరోనా బారిన పడి మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు.స్వల్ప లక్షణాలున్నా కూడా వీరంతా అప్రమత్తం అయి పోతున్నారు. రాజేంద్ర ప్రసాద్ కూడా కరోనా బాధితుడే.ఇంకా అలనాటి ఖుష్బూకు కూడా కరోనానే!ఈ విధంగా ఒక్కరేంటి ఇద్దరేంటి చాలా మంది కరోనా నుంచి కోలుకుని వారు ఉంటే చాలా మంది తాజాగా ఆ లక్షణాలు శరీరంలో కనిపించి కలవరం చెందిన వారు ఉన్నారు.అయినా కూడా చిత్ర సీమ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మొండి ధైర్యంతో సినిమాలు షూట్ చేసుకుంటూ వెళ్తోంది.
తాజాగా క్రియెటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రంగమార్తాండ అనే సినిమా చేస్తున్నారు.ఎప్పుడో విశాఖ తీరంలో మొదలయిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ పడుతూ వస్తోంది.దీంతో ఈ సినిమాను ఎలా అయినా పూర్తి చేయాలన్న ఆలోచనతో షూటింగ్ ను మరింత వేగవంతం చేశారు కృష్ణవంశీ.తాజా షూట్ షెడ్యూల్స్ లో ప్రకాశ్ రాజ్ తో పాటు బ్రహ్మానందం కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి స్టిల్స్ ను కూడా ఎప్పటికప్పుడు ఫేస్బుక్ లో అప్ చేస్తున్నారు కృష్ణవంశీ. ఇక సినిమా షూట్ లో కూడా పూర్తి గా కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సెట్ ను శానిటైజ్ చేయిస్తున్నారు. అంతేకాదు పూర్తిగా భౌతిక దూరం పాటిస్తూనే వీలున్నంత వేగంగా షూట్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.