యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తన మార్కెట్ ను పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకున్నాడు. ఇలా బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ను పెంచుకున్న ప్రభాస్ ప్రస్తుతం కూడా పాన్ ఇండియా లేదా అంతకు మించిన సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆది పురుష్,  ప్రభాస్ కెరీర్‌లోనే మొదటిసారి పౌరాణిక కథతో మూవీ చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించబోతున్నాడు. అది మాత్రమే కాదు ప్రభాస్ కి ఇది బాలీవుడ్ స్ట్రీట్ మూవీ. అందుకే ఈ మూవీని బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, కృతీ సనన్ లాంటి క్రేజీ స్టార్స్ ఈ మూవీలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను 10 భాషల్లో 20 వేలకు పైగా థియేటర్ లలో విడుదల చేయాలనే ప్లాన్ లో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సినిమాతో పాటు రాధే శ్యామ్ సినిమాలో కూడా నటించాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు. ఈ సినిమాలతో పాటు ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ లో నటించడానికి ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా ఇప్పటికే జరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: