అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు దక్కడంతో మొదటి సినిమాతోనే రకుల్ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. అలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత వరుస పెట్టి తెలుగు సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఈ హాట్ బ్యూటీ తెలుగుతో పాటు ఇతర భాష సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

 ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ  బాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో మునిగితేలుతోంది. ఈ విషయం పై గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ రీసెంట్ గా కన్ఫామ్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ, తాను ప్రేమలో ఉన్నట్లుగా చెప్పింది. తాము ఇద్దరం చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నట్లు రకుల్ ప్రీతి సింగ్ తెలియజేసింది. తన జీవితంలో ఇదొక అద్భుతమైన పేజీ అని ఈ ముద్దుగుమ్మ తెలియజేసింది. తమ రిలేషన్ షిప్ గురించి తమ ఇంటి సభ్యులకు, స్నేహితులందరికీ తెలుసని ఈ హాట్ బ్యూటీ తెలియజేసింది. అలాగే ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన లేదు అని, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలి అని రకుల్ ప్రీత్ సింగ్ తెలియజేసింది. ఇలా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ గురించి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: