అంతర్లీనంగా దేశంలోని అన్ని మతాల వారు భరతమాత అనే ఒకేతల్లి బిడ్డలమన్న సందేశం ఇస్తూ తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో సూపర్ హిట్ కావడంతో ఆ తరువాత తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ, రజనీకాంత్, చంద్రమోహన హీరోలుగా రామ్ రాబర్ట్ రహీం పేరుతోనూ, తమిళంలో శంకర్ సలీం సైమన్ గానూ, మలయాళంలో జాన్ జాఫర్ జనార్ధన్ గానూ తెరకెక్కి ఆ భాషల్లోనూ మంచి విజయమే సాధించింది. ఆ తరువాత ఇలాంటి కథలు చాలానే వచ్చాయనుకోండి. ఇక తెలుగులో ఛత్రపతి శివాజీ చిత్రాన్ని నిర్మించాలన్నది నటశేఖర కృష్ణ చిరకాల కోరిక. ఆయన స్టార్డమ్ కొనసాగుతున్న సమయంలో దానికి ఎన్నో ప్రయత్నాలు చేసి, పలువురు రచయితలను నియమించుకుని స్క్రిప్టు కూడా తయారు చేసుకున్నారని చెపుతారు. అయితే ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తెరకెక్కితే ఓ వర్గం మనోభావాలు దెబ్బతింటాయేమోనని ఆలోచించిన కృష్ణ కేవలం ఆ ఒక్క కారణంగానే ఆ ప్రాజెక్టును మొత్తంగా పక్కనబెట్టారు. ప్రజల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తూ వాటితో చలికాచుకునే కొందరు రాజకీయనాయకులతో పోలిస్తే మన వెండితెర కథానాయకులు ఎంతో మెరుగని ఒప్పుకుని తీరాల్సిందే కదూ.!
అంతర్లీనంగా దేశంలోని అన్ని మతాల వారు భరతమాత అనే ఒకేతల్లి బిడ్డలమన్న సందేశం ఇస్తూ తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో సూపర్ హిట్ కావడంతో ఆ తరువాత తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ, రజనీకాంత్, చంద్రమోహన హీరోలుగా రామ్ రాబర్ట్ రహీం పేరుతోనూ, తమిళంలో శంకర్ సలీం సైమన్ గానూ, మలయాళంలో జాన్ జాఫర్ జనార్ధన్ గానూ తెరకెక్కి ఆ భాషల్లోనూ మంచి విజయమే సాధించింది. ఆ తరువాత ఇలాంటి కథలు చాలానే వచ్చాయనుకోండి. ఇక తెలుగులో ఛత్రపతి శివాజీ చిత్రాన్ని నిర్మించాలన్నది నటశేఖర కృష్ణ చిరకాల కోరిక. ఆయన స్టార్డమ్ కొనసాగుతున్న సమయంలో దానికి ఎన్నో ప్రయత్నాలు చేసి, పలువురు రచయితలను నియమించుకుని స్క్రిప్టు కూడా తయారు చేసుకున్నారని చెపుతారు. అయితే ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తెరకెక్కితే ఓ వర్గం మనోభావాలు దెబ్బతింటాయేమోనని ఆలోచించిన కృష్ణ కేవలం ఆ ఒక్క కారణంగానే ఆ ప్రాజెక్టును మొత్తంగా పక్కనబెట్టారు. ప్రజల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తూ వాటితో చలికాచుకునే కొందరు రాజకీయనాయకులతో పోలిస్తే మన వెండితెర కథానాయకులు ఎంతో మెరుగని ఒప్పుకుని తీరాల్సిందే కదూ.!