ప్రస్తుతం ప్రపంచదేశాలకు అందరికి కలిపి ఉన్న ఏకైక శత్రువు "కరోనా". మూడు అంటే మూడు అక్షరాల పదమే కానీ ఇది పెట్టే టార్చర్..చూపే నరకం భరించలేనిది.  గత కొన్ని నెలలు నుండి పరిస్ధితి అదుపులోకి వచ్చింది కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయిలే ఇక హ్యాపీగా ఉండచ్చు అనుకుంటున్న టైంలోనే మళ్ళీ విజృంభిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కరోనా.

రోజుకో వేరియంట్ తో తన రూపాని మార్చుకుంటూ మళ్ళి ఊహించని విధంగా విజృంభిస్తుంది కరోనా వైరస్. ఇక ఈ క్రమంలో నే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి నరకయాతన అనుభవిస్తున్నారు. తమ నుండి ఈ వైరస్ వేరే వాళ్లకి సోకకుండా తమను ఐసోలేట్ చేసుకుంటున్నారు.

ఇక సీనియర్ హీరోయిన్..పోలిటీషియన్ అయిన ఖుష్బూ సందర్‌ కి కూడా ఈ మధ్యనే కరోనా పాజిటివ్‌ వచ్చిన్నట్లు  ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ..వైరస్ పాజిటివ్ వచ్చిన్నట్లు సోషల్‌ మీడియా వేదిక వెల్లడించింది. ఇక ఈ క్రమంలో నే ఆమె పోస్ట్ చేస్తూ.. ‘నాకు కరోనా వచ్చేసింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుండి తప్పించుకున్నప్పటికీ ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయాను. మార్నింగ్ వరకు బాగానే ఉన్న కానీ సడెన్ గా ముక్కు కారడం స్టార్ అయ్యింది.

అది ఎక్కువ కావడంతో టెస్ట్‌ చేయించుకున్న..దీంతో కరోనా ఉన్నట్లు బయట పడింది. ప్రజెంట్ ఐసోలేషన్‌లో ఉన్న.. ఇక ఇలా ఒంటరిగా ఉండటం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ తప్పదు ఉండాల్సిందే. ఇక రాబోయే 5 రోజులు నన్ను బాగా ఎంటర్‌టైన్‌ చేయండి. ఒక్కవేళ మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చెయించుకోండి"అంటూ పోస్ట్ చేసింది. ఇక దీంతో ఆమె అభిమానులు ఖుష్బూ తొందరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి పరిస్ధితుల నుండి మనం ఎప్పుడు బయటపడతాం అంటూ బాధపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: