సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్బ్ హీరోయిన్ కీర్తి సురేష్ ల కలయికలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. మహేష్ ఈ సినిమాలో ఒక ఫైనాన్స్ వ్యాపారి పాత్ర చేస్తుండగా కీర్తి, బ్యాంక్ ఉద్యోగినిగా కనిపించనున్నట్లు సమాచారం. పరశురామ్ తీస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని విలన్ గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఇక ఇటీవల రిలీజ్ అయిన సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ బ్లాస్టర్ టీజర్ అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకని సినిమాపై మరింతగా అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే నాలుగు రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు హఠాత్తుగా అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో కృష్ణ, మహేష్ బాబు సహా యావత్ ఘట్టమనేని కుటుంభం మొత్తం కూడా ఎంతో విషాదంలో మునిగిపోయింది.

మరోవైపు నాలుగు రోజుల్లో సంక్రాంతి పండుగ రానుండడంతో అసలు సర్కారు వారి పాట నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందా లేదా డౌట్ మహేష్ ఫ్యాన్స్ లో కొనసాగుతోంది. కాగా విషయం ఏమిటంటే, మహేష్ తో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం ఎంతో బాధలో ఉన్న ఈ విపత్కర సమయంలో సర్కారు వారి పాట యూనిట్ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉండదనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరి ఈ విషయమై ఏమి జరుగుతుందో, మహేష్ ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి. కాగా ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: