మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సెట్స్ మీద ఏకంగా మూడు సినిమాలను ఉంచాడు. ఆయన హీరోగా చేసిన ఆచార్య చిత్రానికి సంబంధించిన పనులన్నీ పూర్తి అయ్యి విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 3వ తేదీన ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇక ఈ సినిమా విడుదల కాకముందే గాడ్ ఫాదర్ చిత్రాన్ని మొదలుపెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లుసిఫర్ సినిమాకి రీమేక్ గా కాగా చిరంజీవి ఇమేజ్ కి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో చిరంజీవి స్థాయికి తగ్గట్లుగా నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మెగా అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తుందని మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తుందని చెబుతున్నారు. మరొక ఇంపార్టెంట్ పాత్రలో సత్య దేవ్ నటిస్తూండగా బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడడానికి ఇదే ముఖ్య కారణం అయింది.

ఇకపోతే ఈ సినిమా పట్ల చిరంజీవి ఇతర ఆకర్షణలు ఎందుకు తెస్తున్నాడో తెలియదు కానీ  కథ మీద గ్రిప్ లేదనే విషయం అర్ధమైపోయే ఇలాంటి ఎక్స్ట్రా యడింగ్స్ పెట్టడానికి చిరంజీవి ఎక్కువ మొగ్గు చూపుతున్నాడని తెలుస్తుంది. కథలో దమ్ముంటే హీరో ఎవరైనా చూస్తారు అలాంటి కథ లో దమ్ము లేకుండా ఎలా ఆకర్షణలలో ఇలా మెరుపులు పెడితే సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది ఈ సినిమా రిజల్ట్ బట్టి చూడాలి. మరి ఈ సినిమా మీద చిరంజీవికి నమ్మకం ఎందుకు కుదరటం లేదో తెలియడం లేదు. ఈ సినిమా తర్వాత చిరంజీవి మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: