ప్రభాస్ కు తన సినిమాల విషయంలో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు అని అంటున్నారు కొంతమంది సినీ విమర్శకులు.. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఇంకా సినిమా మొదలు పెట్టనే లేదు అప్పుడే ప్రభాస్ ను హాలీవుడ్ లెవెల్ లో పొగడడం ఏంటి అని వారు చెప్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాదేశ్యామ్ సినిమా ను విడుదల చేసే పనిలో బిజీ గా ఉన్నారు.  రాధే శ్యామ్ సినిమా ను పూర్తి చేయకుముందే ప్రభాస్ తన తదుపరి చిత్రాలకు వెళ్ళిపోయాడు. అలా ఇప్పుడు ఏకంగా నలుగు సినిమాలను సెట్స్ పై ఉంచాడు. 

వాటిలో క్రేజీ ఫిలిం గా ఉంది సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై కూడా ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు ఏర్పరుచుకున్నారు. శృతి హాసన్ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా కేజిఎఫ్ లెవెల్లో తెరకెక్కుతుంది అంటున్నారు. ఇక బాలీవుడ్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా ఆది పురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మైథలాజికల్ సినిమా గా తెరకెక్కుతు ఉండగా ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో వాఋ తెరకెక్కిస్తు ఉండడం విశేషం. 

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా మొదలుపెట్టనే లేదు అప్పుడే గొప్పలు చెప్పడం మంచిది కాదని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ సినిమా నిర్మాత ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్రం విడుదల అయిన తరువాత ప్రభాస్ రేంజ్ హాలీవుడ్ కి రేంజ్ లో ఉంటుందని అన్నారు. దాంతో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు అంటున్నారు విమర్శకులు. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కానున్నాడు. ఇకపోతే సందీప్ వంగ దర్శకత్వంలో కూడా ప్రభాస్ స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు. మరి ప్రభాస్సినిమా తర్వాత ఏ స్థాయి లో ఇమేజ్ అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: