టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకు పోతున్న స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ జనవరి 7 న విడుదలవ్వాల్సిన ఈ సినిమా ఇపుడు కరోనా కారణంగా మళ్ళీ వాయిదా పడింది. కాగా ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇపుడు ఎన్టీఆర్ తదుపరి చిత్రం గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెగ ఊరిస్తోంది. తారక్ తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో ఒక్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులోనూ స్టార్ హీరోయిన్లు ప్రత్యేక పాటల్లో స్టెప్పులు వేస్తూ సందడి చేయడం ట్రెండింగ్ లో ఉంది. అయితే ఇపుడు తారక్ సినిమాలో కూడా ఇదే ఫార్ములా వాడుతున్నట్లు తెలుస్తుందా. కాస్త కొత్తదనం కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించనున్నట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ మూవీ సాహో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా ఇపుడు మరో సారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నారు అన్న వార్త అందరినీ సంతోష పెడుతోంది. ఇక శ్రద్ద డ్యాన్స్, గ్రేస్ పీక్స్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనుందని తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన ఫ్యాన్స్ ఆనందంతో స్టెప్పులు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: