పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ సినిమా కోసం ఆయ‌న అభిమానులు అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్ర‌స్తుతం డార్లింగ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రియాడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ సూప‌ర్ స్టైలిష్‌గా క‌నిపించ‌నున్నాడు. రాధేశ్యామ్  సినిమా తొలుత జ‌న‌వ‌రి 14న విడుద‌లవుతుంద‌ని ప్రక‌టించింది చిత్ర యూనిట్‌. భారీ బ‌డ్జెట్ చిత్రం కావ‌డంతో.. దేశంలో ఓవైపు క‌రోనా, మ‌రోవైపు ఒమిక్రాన్ కేసులు విజృంభించ‌డంతో ఊహించినంత‌గా క‌లెక్ష‌న్‌లు రావు అని, న‌ష్టాలు వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని వాయిదా వేసారు.

ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రామాయ‌ణం నేప‌థ్యంలో ఉండ‌నుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌గా.. కృతిస‌న‌న్ సీత‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాల‌తో పాటు అదేవిధంగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ కూడాచేస్తున్నాడు ప్ర‌భాస్‌. ప్రాజెక్ట్ కే అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా ఇటీవ‌లే మొద‌లైన‌ది. సినిమాలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్‌, దీపికాప‌దుకొనే కూడా న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌, విడుద‌ల మ‌రింత‌గా ఆల‌స్య‌మ‌వుతుంద‌ని టాక్ వినిపిస్తుంది. ఈ త‌రుణంల నిర్మాత అశ్వ‌నిద‌త్ స్పందించారు. ఈ సినిమా షూటింగ్ మ‌రింత ఆల‌స్యం కానున్న‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారం లో ఎలాంటి నిజం లేదు. ప‌రిస్థితులు చూసుకుని ఈ నెల చివ‌రిలోపు షూటింగ్‌ను మ‌ళ్లీ ప్రారంభం చేస్తామ‌ని చెప్పుకొచ్చారు నిర్మాత‌. సాధ్య‌మైనంత వ‌ర‌కూ వ‌చ్చే వేస‌విలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుద‌ల చేయాల‌ని సిద్ధంగా ఉన్న‌ట్టు వెల్ల‌డించారు.  క‌చ్చితంగా అనుకున్న స‌మ‌యానికి విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పారు.  అనుకున్న స‌మ‌యానికే ప్రేక్ష‌కుల‌ముందుకు తీసుకొస్తామ‌ని.. ప్ర‌భాస్ సినిమాపై నిర్మాత ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: