ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రామాయణం నేపథ్యంలో ఉండనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించగా.. కృతిసనన్ సీతగా నటిస్తోంది. ఈ చిత్రాలతో పాటు అదేవిధంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ కూడాచేస్తున్నాడు ప్రభాస్. ప్రాజెక్ట్ కే అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా ఇటీవలే మొదలైనది. సినిమాలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్, దీపికాపదుకొనే కూడా నటిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్, విడుదల మరింతగా ఆలస్యమవుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ తరుణంల నిర్మాత అశ్వనిదత్ స్పందించారు. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానున్నట్టు జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదు. పరిస్థితులు చూసుకుని ఈ నెల చివరిలోపు షూటింగ్ను మళ్లీ ప్రారంభం చేస్తామని చెప్పుకొచ్చారు నిర్మాత. సాధ్యమైనంత వరకూ వచ్చే వేసవిలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. కచ్చితంగా అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అనుకున్న సమయానికే ప్రేక్షకులముందుకు తీసుకొస్తామని.. ప్రభాస్ సినిమాపై నిర్మాత ఆసక్తికరమైన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.