దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. మరోసారి సినీ సెలబ్రిటీలు సైతం ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. థర్డ్ వేవ్ కేసులు ఇప్పటికే ఇండస్ట్రీలో వేగంగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తను కరోనా బారిన పడ్డానని.. తనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.ఈ హీరోయిన్ ప్రస్తుతం మహేష్ బాబు కి జోడీగా 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట చిత్రబృందం మొత్తానికి కరోనా భయం పట్టుకుంది.

 ఈ సినిమా కోసం మహేష్ బాబుతో కలిసి తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాడు. అయితే మహేష్ బాబు నుంచి తమన్ కి కరోనా వచ్చినట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన మహేష్ కి అక్కడే కరోనా అటాక్ అయిందట. ఆ తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ లో తమన్ డైరెక్టర్ పరుశురాం తో సన్నిహితంగా మెదిలాడు. దీంతో పరశురామ్ కూడా టెస్ట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక అటు పరశురాం కూడా హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు మిగిలిన టీం మెంబర్స్ తో కూడా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. అందుకే హీరోయిన్ కీర్తి సురేష్ సైతం కరోనా టెస్ట్ చేయించుకుంది. దీంతో ఆమెకి పాజిటివ్ అని తేలింది.

 కీర్తి సురేష్ కి కరోనా అని తెలియగానే చాలామంది మహేష్ బాబు  ద్వారానే ఈమెకు కరోనా సోకింది ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక కీర్తి సురేష్ కి కరోనా సోకడంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఈ సోషల్ మీడియా ద్వారా అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తం మీద సర్కారు వారి పాట మూవీ టీం కి కరోనా భయం గట్టిగానే పట్టుకుందని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతానికిపైగా పూర్తయింది. ఈ సినిమాని ఏప్రిల్ 1న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇంతలోనే మహేష్ బాబు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు ఇప్పుడు కీర్తి సురేష్ కూడా కరోనా బారిన పడడం గమనార్హం. అందుకే ఈ సినిమా షూటింగ్ మరో నెల వరకు లేనట్లేనని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: