ఇటీవల అయ్యి మంచి రికార్దులను సొంతం చేసుకున్న సినిమా పుష్ప.. సుకుమార్, బన్నీ, రష్మిక మందన్న కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. విడుదల అయ్యి నెల కూడా కాలేదు. కానీ భారీ వసూల్లను రాబట్టింది.. అఖండ రికార్డు ను బ్రేక్ చేసింది. సినిమా కథ, అల్లు అర్జున్ స్టయిల్,రష్మిక పొగరు. అదిరిపొయె ఫెమ్ ను అందించింది. ఈ సినిమాలొని ప్రతి పాట ఒక అద్భుతం అని చెప్పాలి. 



తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌, కోలీవుడ్‌లో కూడా రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాక్కో దాక్కో మేక పాట నుంచి మొదలు పెడితే శ్రీవల్లి, సామీ సామీ, ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా వరకు అన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. మిలియన్ వ్యుస్ కూడా అందుకున్నాయి. ఇప్పుడు ఆ పాటలు యువతను ఊర్రుథలూరిస్తున్నాయి.



ముఖ్యంగా ఫోక్ సింగర్‌ మౌనిక యాదవ్ పాడిన సామీ సామీ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న సామీ సామీ పాట క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు కూడా దాటింది. టాంజానియాకు చెందిన కిల్‌పాల్ అనే వ్యక్తి కూడా సామీ సామీ పాటకు స్టెప్పులు వేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. సామీ సామీ పాట ఇప్పుడు ఇండియాలో క్రియేట్ చేస్తుందని రాసుకొచ్చాడు. దీనికి అల్లు అర్జున్‌, రష్మిక, దేవిశ్రీ ప్రసాద్‌ను ట్యాగ్ కూడా చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఎంత అందంగా వుందో మీరు ఒకసారి ఆ లుక్ వేసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: