నందమూరి నట సింహం బాలకృష్ణ, టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో పోయిన సంవత్సరం అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అఖండ సినిమాతో వంద కోట్ల కలెక్షన్ లను సాధించి బాలకృష్ణ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.  అయితే ఇలా అఖండ సినిమాతో బాక్సాఫీసు దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్న బాలకృష్ణ తన తదుపరి చిత్రం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్నాడు.  ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది. గోపీచంద్ మలినేని కూడా రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇలా బ్లాక్ బస్టర్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో,  డైరెక్టర్ కలిసి సినిమా చేయబోతున్నారు అనడం తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

అందుకు తగినట్టుగానే ఈ సినిమాలో నటీనటులను కూడా అదే రేంజ్ లో డైరెక్టర్ ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కన్నడ హీరో దునియా విజయ్ ని దర్శకుడు ఎంచుకోగా,  మరో ముఖ్యమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ను దర్శకుడు తీసుకున్నాడు.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలకృష్ణ తో తెరకెక్కించబోయే సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకోసమే దర్శకుడు గోపీచంద్ మలినేని వివిధ భాషల్లో పాపులారిటీ ఉన్న నటులను ఈ సినిమాలో తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా గోపిచంద్ మలినేని, బాలకృష్ణ తో పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: