ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తాజాగా ఈమెపై హీరో సిద్ధార్థ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నాయి. ఈమె పై చేసిన ఈ ట్వీట్ పై కొంతమంది ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా మండిపడుతున్నారు. దీంతో హీరో సిద్ధార్థ పై కొంత మంది విమర్శలు కూడా చేస్తున్నారు. పంజాబ్ లో ప్రధాని మోడీ కాన్వాయ్ ని అడ్డగించడంతో నరేంద్ర మోడీ పై దాడికి ప్రయత్నించడం ఇది ఒక పిరికిపంద చర్య అంటూ ఆమె ఈ విషయాన్ని ఖండిస్తున్నానన్నట్లుగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ విషయంపై హీరో సిద్ధార్థ్ స్పందించడం జరిగింది.
సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వల్ల పెద్ద చర్చకు దారితీసింది. దీంతో కొంతమంది హీరో సిద్ధార్థ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా మరికొంత మంది మహిళలు అతడికి ట్విట్టర్ ఖాతా ఉండకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సైనా తండ్రి కూడా స్పందించడం జరిగింది. అంతేకాకుండా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు కూడా సమాచారం. ఇక సైనా నెహ్వాల్ భర్త కూడా సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పై అసహనం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై సైనా భర్త పారుపల్లి కశ్యప్.. ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మాకు చాలా బాధగా ఉన్నది.. మీ అభిప్రాయాన్ని తెలపడంతో ఎలాంటి తప్పులేదు.. కానీ అలా తెలిపే టప్పుడు కొన్ని మంచి పదాలను వాడండి అంటూ తెలియజేశారు. మీరు చేసిన ఈ వ్యాఖ్యలు చాలా హర్ట్ చేసేలా ఉన్నాయి.. మీకు ఇది కూల్ వర్డ్స్ కావచ్చు.. ప్రతిసారి ఇలాంటి వార్తలు సరైనవి కావు అంటూ కశ్యప్ తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయంపై సైనానెహ్వాల్ ఒక మీడియా ద్వారా తెలియజేసిన విషయం ఏమిటంటే.. సిద్ధార్థ ఏం మాట్లాడాడు ఖచ్చితంగా నాకు తెలియదు.. నేను ఒక నటుడిగా అతడిని ఇష్టపడతానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: