ఛలో సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక మందన. ఆమెకు అదృష్టం ఏ రేంజ్ లో ఉంది అంటే చిన్న సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కూడా ఇప్పుడు అగ్ర హీరోయిన్ గా కొనసాగుతూ నెంబర్ వన్ స్థానానికి గట్టి పోటీ ఇస్తుంది. ఆమె నటించిన తొలి చిత్రం హిట్ కావడంతో ఈ సినిమాపై అందరి దర్శక నిర్మాతలు కూడా పేరు తెచ్చుకోవడంతో ఆమెనే హీరోయిన్ గా పెట్టుకునేందుకు పెద్ద హీరోయిన్ లు సైతం ఏమాత్రం వెనకాడడం లేదు. ఆ విధంగా ఆమె ఇటీవల పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి హిట్ అయ్యింది. 

పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ సాధించుకుని దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది రష్మిక. అలా ఆమె పెద్ద హీరోల సరసన నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్ కావడంతో దేశవ్యాప్తంగా రష్మిక మందన కు మంచి డిమాండ్ ఏర్పడింది. బాలీవుడ్ లో మూడు పైగా చిత్రాల్లో నటిస్తూ అక్కడ కూడా తన హవాను కొనసాగించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక తెలుగులో ఆమె శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు లో కూడా ఆమె నటిస్తుంది. తొందరలోనే అనౌన్స్ అవుతుంది అని తెలుస్తుంది.

ఇకపోతే తాజాగా ఆమె ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. 1995లో ప్రధానిగా ఉన్న పి.వి.నరసింహారావు భారత దేశంలోని ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టారు.ఈ నేపథ్యంను కథగా తీసుకుని ఎంతో వెరైటీగా చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో రష్మిక పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన రష్మిక ఇప్పుడు ఈ స్ఫూర్తిదాయకమైన పాత్రలతో ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: