సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష రీసెంట్ గా కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. 2022 ఎంట్రీ తోనే కరోనా వెల్కం చెప్పిందని త్రిష తన సోషల్ మీడియాలో తెలిపింది. అయితే ఇప్పుడు త్రిష తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. కొవిడ్ నుండి ఆమె సురక్షితంగా బయటపడ్డది. నెగటివ్ అనే న్యూస్ ఇంత హ్యాపీగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదని అని ట్విట్టర్ లో కామెంట్ పెట్టింది త్రిష కృష్ణన్. రెండు దశాబ్ధాలుగా సౌత్ సినీ పరిశ్రమలో సినిమాలు చేస్తూ అలరిస్తున్న త్రిష ఇప్పటికీ అమ్మడు హాట్ ఫేవరెట్ గా ఉంది.

తెలుగులో కొంత గ్యాప్ తీసుకున్న్నా సరే ఇక్కడ మంచి అవకాశం వస్తే చేసేందుకు రెడీ అంటుంది. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతోనే కెరియర్ కొనసాగిస్తున్న త్రిష విజయ్ సేతుపతితో చేసిన 96 సినిమా ఆమెని తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసింది. కమర్షియల్ సినిమాల్లో కన్నా డిఫరెంట్ కథలను చేస్తూ కెరియర్ సాగిస్తుంది త్రిష. సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న అమ్మడు కరోనా బారిన పడటం ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలని అందరు అనుకున్నారు.

ఫైనల్ గా త్రిష కొవిడ్ నుండి బయటపడ్డది. మీ ప్రేమ.. అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను.. నా కోసం ప్రార్ధనలు చేసిన వారందరికి థ్యాంక్స్ అని చెప్పింది త్రిష. ప్రస్తుతం తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్న త్రిష తెలుగులో మెగాస్టార్ సినిమా ఛాన్స్ వచ్చినా సరే కాదనుకుంది. త్రిష కొవిడ్ నెగటివ్ వార్త ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ఆమె ఇంకా మరెన్నో సూపర్ హిట్ సినిమాలు తీయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. త్రిష తెలుగు ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఆమె సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు. మార్నింగ్ గుడ్ న్యూస్ తో త్రిష తన ఫ్యాన్స్ అందరిని అలరించింది. ఈమధ్య సెలబ్రిటీస్ అంతా కొవిడ్ పాజిటివ్ వార్తలతో రాగా త్రిష నెగటివ్ అని ఫ్యాన్స్ ని ఖుషి చేసింది.






మరింత సమాచారం తెలుసుకోండి: