హీరో ధనుష్ కు సౌత్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో హాలీవుడ్లో కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పుడు తెలుగులో కూడా డైరెక్ట్ గా ఓ సినిమా చేయబోతున్నాడు ధనుష్. అందుకే తెలుగు దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ధనుష్ వెంకీ అట్లూరి కి కూడా ఓ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
త్రివిక్రమ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఇందులో హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారు. అంతే కాదు రెండు రోజుల పాటు కొన్ని సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. తాజాగా ఈ బ్యూటీ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు కానీ ఈ చిత్రం నుంచి ఆమె తప్పకుందని ఆ చిత్ర యూనిట్ చెబుతుంది. మలయాళం లో పదికి పైగా సినిమాల్లో నటించిన ఈమె తెలుగులో భీమ్లా నాయక్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మరో చిత్రంలో ఛాన్స్ రావడంతో ఇక్కడ స్టార్ గా ఎదుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవడం ఆమె కెరీర్ పట్ల ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.