మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన హాస్యంతో ఎంతగానో నవ్విస్తూ ప్రేక్షకులందరినీ ఆహ్లాదపరుస్తూ ఉన్నాడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఇటీవల కాలంలో ఆయనకి సినిమా అవకాశాలు తక్కువ అవుతున్నాయి అని విమర్శలు వచ్చిన నేపథ్యంలో బ్రహ్మానందం తన ఆరోగ్యం కారణంగానే సినిమాలు ఒప్పుకోవడం లేదు అని చెబుతున్నాడు. ఓ రేంజ్ లో నటిస్తూ ఏ హీరోకి సాధ్యం కానీ హావభావాలు పలికిస్తూ బ్రహ్మానందం ఇప్పటివరకు సినిమాలో ప్రేక్షకులను అలరించారు అంటే ఆయనకు ఎంతటి టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఆయన ఎన్నో ఆశలతో చేస్తున్న సినిమా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా నానా పటేకర్ హీరోగా నటించిన నట సామ్రాట్ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలిపాడు దర్శకుడు కృష్ణ వంశీ. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాను. వీరిద్దరి కాంబినేషన్ లో ఉండే ఒక పవర్ ఫుల్ సీన్ ఇప్పుడే షూట్ జరిగింది అని అన్నారు. ఇంత వరకు ఎప్పుడూ చేయని పాత్రను బ్రహ్మానందం గారు చేస్తున్నారు. ఈ సినిమా ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తుంది అని వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో అనసూయ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది. రాహుల్ సింప్లిగంజ్ మరియు శివాని కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. దశాబ్దాలుగా కమెడియన్ బ్రహ్మానందం కామెడీ కి అందరూ నవ్వుల పూవులు జల్లుతున్నారు. ఇప్పుడు ఆయనకు సినిమా అవకాశాలు తగ్గిన కూడా ఈ చిత్రం ద్వారా మరిన్ని సినిమా అవకాశాలు రాబట్టుకోవడం ఖాయం అని అందరూ చెబుతున్నారు. మరి 1000 చిత్రలలో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సైతం తన పేరును నమోదు చేసుకున్న బ్రహ్మానందం ఈ సినిమాలో తన కెరీర్ ను పున ప్రారంభిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: