ఇక ఎప్పటిలాగానే ప్రస్తుతం ప్రతి చానల్ లో సంక్రాంతి సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేసినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. అయితే ఈ సంక్రాంతికి టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ అటు కేరళలో ప్రత్యక్షమైంది. కేరళలోనే ఇక ఈ సంక్రాంతి ఈవెంట్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా సుమ అక్కడికి వెళ్ళి కేరళ మహిళలు అందరితో కూడా సందడి చేసింది. ఇక ఆ తర్వాత బంగార్రాజు చిత్రబంధం నాగార్జున నాగచైతన్య కృతి శెట్టి కూడా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇక కార్యక్రమం మొత్తం సందడి సందడి గా మారిపోయింది అని చెప్పాలి.
ఇక సీరియల్ సెలబ్రిటీ లు అందరికీ కూడా కేరళ వేదికగా ఎన్నో గేమ్స్ కూడా నిర్వహించారు. ఇక ఆ తర్వాత ఒక స్టేజ్ పై నాగార్జున ముందే ఇక రెండు టీములుగా ఏర్పడి అంతాక్షరి ఆడటం కూడా చేశారు. ఇలా ఇటీవలే విడుదలైన ప్రోమో చూస్తూ ఉంటే ఇక ఈ సంక్రాంతి కి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఖాయం అని అర్థమవుతుంది. ఈ కార్యక్రమానికి కేరళలో సంక్రాంతి అల్లుళ్ల సందడి ఒక టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ ప్రోమో పై లుక్కేయండి. కాసేపు హాయిగా నవ్వుకోండి.