`మున్నా మైఖేల్` అనే హిందీ చిత్రంతో సినీ రంగ‌ప్ర‌వేశం చేసిన అందాల భామ‌ నిధి అగ‌ర్వాల్.. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగ చైత‌న్య హీరోగా వ‌చ్చిన `స‌వ్య‌సాచి` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత అక్కినేని అఖిల్‌కు జోడీగా `మిస్టర్ మజ్ను` మూవీలో న‌టించింది. కానీ, ఈ రెండు చిత్రాలు ఆమెకు స‌క్సెస్ తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి.

అయితే ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో నిధి అగ‌ర్వాల్ ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుని యూత్‌లో సూప‌ర్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రం త‌ర్వాత తెలుగుతో పాటు త‌మిళం నుంచి కూడా అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న నిధి.. ఇప్పుడు `హీరో` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది.

అశోక్ గల్లా హీరోగా శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిధి అగ‌ర్వాల్‌.. ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకుంది. అలాగే త‌న పెళ్లిపై సైతం గుట్టు విప్పింది.

తాను పెళ్లి చేసుకోబోయే వాడు తన‌ను, త‌న వృత్తిని గౌరవించాలని, అలాగే త‌న‌ను బాగా చూసుకోవాలని తెలిపింది. మంచి కేరింగ్‌ పర్సన్‌ని ఇష్ట‌ప‌డ‌తాను.. అలాంటి వ్య‌క్తినే వివాహం చేసుకుంటాన‌ని పేర్కొంది. దీంతో ఆ క్వాలిటీస్‌ ఉన్నవాళ్లంతా నిధికి ట‌చ్‌లోకి వెళ్లేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. కాగా, మొన్నీమ‌ధ్య నిధి త‌మిళ న‌టుడు శింబుతో ప్రేమ‌లో ఉందంటూ వార్త‌లు పుట్టుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈశ్వరన్ సినిమాతో ఏర్ప‌డిన వీరిద్ద‌రి ప‌రిచ‌యం ప్రేమ‌కు దారి తీసింద‌ని.. ఇక త్వ‌ర‌లోనే నిధి, శింబులు పెళ్లి కూడా చేసుకోనున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: