సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారంటే చాలు వారి స్టార్ డ మ్ అమాంతం పెరిగి పోతూ ఉంటుంది.అంతే కాకుండా ఇక హీరోలు సైతం వారి రెమ్యూనరేషన్ అమాంతం పెంచుతూ ఉంటారు. అయితే హీరో హీరోయిన్లు ఎంత పెద్ద సక్సెస్ వస్తే.. అంతగా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్తారు. ప్రతి సినిమా హిట్ అయితే చాలు వారి పారితోషికాన్ని అమాంతం పెంచుతూ ఉంటారు మన స్టార్స్. అయితే తాజాగా రెమ్యునరేషన్ పెంచిన వారిని చూద్దాం.

1).రష్మీక  :

 హీరోయిన్ రష్మీక పుష్ప సినిమా అమాంతం తన రెమ్యునరేషన్ ని పెంచినట్లు తెలుస్తోంది. రష్మిక పుష్ప మొదటి భాగానికి రెండు కోట్లు తీసుకున్నట్లుగా సమాచారం. ఇక పార్ట్ 2 కి మూడు కోట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కండిషన్ నీ చిత్ర మేకర్స్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.

2) దీపికా పడుకొనే:బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో దీపికా పడుకొనే కూడా ఒకరు. ఇమే నటించిన బాజీరావ్ మస్తానీ సినిమా కు 8 కోట్ల రూపాయలు అందుకుంది.. ఆ సినిమా సక్సెస్ కావడంతో పద్మావతి సినిమాకి 12 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దీంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

3). కంగనా రనౌత్:ఒకవైపు స్టార్ హీరోలతో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది ఈమె. మణికర్ణిక సినిమా కు 14 కోట్లు అందుకుంది.తలైవి సినిమా కోసం ఏకంగా.24 కోట్లు తీసుకున్నట్లుగా సమాచారం.

4). హీరో కార్తీక్ ఆర్యన్:ప్యార్ కా పంచనామ మూవీతో తక్కువ రెమ్యునరేషన్ ని అందుకున్నాడు. కానీ సోను సూద్ చేసిన ఒక ట్వీట్ ద్వారా ఆయన స్టార్ హీరోగా మారిపోయాడు. దీని తర్వాత ఒక సినిమాకు 7 కోట్లు తీసుకున్నాడట.. ఇక తాజాగా ధమాకా సినిమా కోసం 22 కొట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

5). హీరో యష్:కే జి ఎఫ్ మూవీ తో గ్లోబల్ స్టార్ గా  మారిపోయాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి 15 కోట్లు అందుకుంటున్నాడు. తాజాగా కే జి ఎఫ్-2 కోసం 30 కోట్లు డిమాండ్ చేసినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: