పవర్ స్టార్ పవన్, కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర  మంచి విజయం సాధించడంతో వకీల్ సాబ్ సినిమా ఇచ్చిన జోష్ లో వరుస సినిమాలకు కమీట్ అవుతూ వస్తున్నాడు.  అందులో భాగంగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో నిలపాలని అనుకున్న పవన్ కళ్యాణ్ కు అనుకోని కారణాల వల్ల అది వీలు కాలేదు. ఈ సినిమాకు సాగర్ కే కేంద్ర దర్శకత్వం వహిస్తుండగా,  త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నాడు.  

ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాను కూడా సగం పైగా పూర్తిచేశాడు. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత ఈ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కొండపొలం అనే సినిమా తెరకెక్కించాడు. అయితే కొండాపొలం సినిమా షూటింగ్ పూర్తయి కొన్ని రోజుల క్రితం విడుదల కూడా అయ్యింది. అయితే హరిహర వీరమల్లు సినిమాను మరికొద్ది రోజుల్లో తిరిగి ప్రారంభించబోతున్నారు. అయితే ఇప్పటికే సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి చిత్ర బృందం పెద్దగా ఇలాంటి అప్డేట్ లను బయటకి వదలలేదు.  అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఈ విషయాన్ని తెలియజేసింది. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెరకెక్కిన హీరో సినిమా  సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిధి అగర్వాల్ 'హరిహర వీరమల్లు' సినిమా రెండు టైమ్ లో నడుస్తుంది అనే ఆసక్తికర విషయాన్ని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: