మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పనులను పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా ప్రమోషన్ లలో  కూడా దేశవ్యాప్తంగా పాల్గొన్నాడు.  కాకపోతే ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాను జనవరి 7 వ తేదీన విడుదల చేయడం సరికాదు అనే ఉద్దేశంతో ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా ఒక ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమాను ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా తెలియజేసింది.

  అయితే ఆర్ఆర్ఆర్ విడుదల కాకముందే రామ్ చరణ్ ఇండియాలోనే భారీ క్రేజ్ ఉన్న దర్శకులతో సినిమాలను చేసే ప్లాన్ లో ఉన్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఇండియాలోనే మోస్ట్ క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ ల షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది. అయితే ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేసుకొని, మరో సినిమా షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్న రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా రామ్ చరణ్ మరో యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  ఈ మధ్యే శ్యామ్ సింగరాయ్ సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకున్న రాహుల్ సాంకృత్యయన్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోతున్నాడు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: