అందుకే ఈయన తీసిన చాలా సినిమాల్లో నటుడు సుబ్బరాజు కనిపిస్తూ ఉంటాడు. అది చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా సుబ్బరాజు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` సినిమాలో మొదటి సారి సుబ్బరాజు నటించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అప్పటి నుంచీ సుబ్బరాజు సెంటిమెంట్ పూరిని వదలడం లేదు. సాధ్యం అయినంత వరకు పూరి అతడు లేకుండా ఏ సినిమా చేయడు.
ఆయన దర్శకత్వంలో పోకిరి, దేశముదురు, బుజ్జిగాడు, నేను నా రాక్షసి, బిజినెస్ మెన్, టెంపర్, రోగ్ చివరకి హిందీ సినిమా బుడ్డా హోగా తేరా బాప్ లో కూడా సుబ్బరాజు దర్శనమిచ్చాడు. అలాగే సుబ్బరాజు మంచి నటుడిగా టాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి ఒక రకంగా పూరి జగన్నాథ్ సినిమాలే కారణమని చెప్పొచ్చు.
కాగా, పూరి జగన్నాథ్ ప్రస్తుతం `లైగర్` సినిమాను తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్నాడు. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, పూరీ జగన్నాథ్ లు కలిపి నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 2022 ఆగస్ట్ 25న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.