పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోయిన సంవత్సరం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా జోష్ లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన  షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. చివరి ప్యాచ్ వర్క్ షూటింగ్ తప్ప మిగతా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంది కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.  ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాను కూడా కొంత భాగం షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తయిన తర్వాత క్రిష్ జాగర్లమూడి, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ తో హీరోయిన్ గా కొండపొలం సినిమాను చిత్రీకరించడం వల్ల ఈ సినిమా పెండింగ్ లో పడిపోయింది.

అయితే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో తిరిగి మళ్ళీ ప్రారంభించబోతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ ప్లానింగ్ వేసుకున్నారట. ఇటీవల తన భార్యా పిల్లలను కలవడానికి పవన్ కళ్యాణ్ రష్యా కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే గత వారం పవన్ కళ్యాణ్ హాలిడే ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. దీనితో హరిహర వీరమల్లు సినిమాను తిరిగి ప్రారంభించాలి అని అనుకున్నారట. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు విరివిగా పెరిగిపోవడంతో కొంతకాలం చూసి కరోనా తగ్గుముఖం పట్టినట్లు అయితే ఫిబ్రవరి నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ వున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: