యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో తన క్రేజ్ ని పెంచుకున్నాడు. అయితే బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ను అలాగే కంటిన్యూ చేసే ఉద్దేశంతో ప్రభాస్ కూడా వరుస పాన్ ఇండియా అంతకుమించిన సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ ల షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం కూడా కనిపించబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్,  ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ ను తెలియజేశాడు. ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ ల షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. పరిస్థితులు సహకరిస్తే ఈ నెల ఆఖరి వరకు మరో షెడ్యూలు ను ప్రారంభించే ప్లానింగ్ లో ఉన్నాం.

 ఆ షెడ్యూల్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేస్తామని నాగ్ అశ్విన్ తెలియజేశాడు. ఇలా నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమా విడుదల సమయాన్ని తెలిపి ప్రభాస్ అభిమానులకు ఆనందాన్ని కలుగజేశాడు.  ఇది ఇలా ఉంటే ప్రభాస్ నటించిన రాదే శ్యామ్ సినిమా ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబ్బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. కాకపోతే ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు. ఇంకా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. ప్రభాస్ ఈ సినిమాలతో పాటు ఆది పురుష్,  సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు.  అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీలో నటించడానికి రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: