ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాతో సాధించిన విజయం ఆయనకు ఎంతో కీలకమైనది అని చెప్పవచ్చు. అందరు హీరోలు కూడా పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతూ తమ సత్తాను దేశమంతటా చాటగా ఒక అడుగు వెనకాలే ఉన్న అల్లు అర్జున్ ఈ సినిమాతో వారందరినీ మించిన ఇమేజ్ ను సొంతం చేసుకొని ఎంతో గ్రాండ్ గా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. పుష్ప సినిమా విడుదలై దాదాపు నెల రోజులు కావస్తున్నా కూడా ఆ సినిమా యొక్క వసూళ్లు ఇంకా తగ్గలేదు అంటే అల్లు అర్జున్ తన సినిమాలతో ప్రేక్షకులలో ఎంతటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నడో అర్థం చేసుకోవచ్చు .

ఆ విధంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాను డిసెంబర్ లో విడుదల చేసి మంచి పని చేసి భారీ స్థాయిలో ఇమేజ్ దక్కించుకున్నాడు. ఏదైతేనేం అల్లు అర్జున్ కు అన్ని కలిసి రావడం పట్ల అభిమానులు ఎంతగానో ఆనంద పడుతున్నారు. కానీ మెగా అభిమానులు మాత్రం అల్లు అర్జున్ చేసే కొన్ని చర్యలను చాలా వేద అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ మెగా హీరోలకు తగ్గట్లుగా ప్రకటించకపోవడం కేవలం అల్లు బ్రాండ్ ను ప్రమోట్ చేసుకునే విధంగా ఆయన చర్యలు చేస్తుండడం పట్ల వారు కొంత సీరియస్ గా ఉన్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఒక పొరపాటు చేసిన అల్లు అర్జున్ అప్పటినుంచి మెగా అభిమానుల ట్రోలింగ్ కి గురవుతున్నాడు.  తాజాగా ఆయన హాజరైన అయిన రౌడీ బాయ్స్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అల్లు బ్రాండ్ ప్రమోట్ చేసుకోబోతున్నట్లుగా మాట్లాడటం ఒక్కసారిగా అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతో మొదటి నుంచి ఆయన సినిమాలకు ఆయనకు సపోర్ట్ చేస్తున్న మెగా అభిమానులు ఆయన పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపట్ల మెగా అభిమానులు సీరియస్ ఉన్నారు కానీ మెగా హీరోలు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. వాస్తవానికి అల్లు అర్జున్ ఎప్పుడో మెగా బ్రాండ్ నుంచి తప్పుకొని ఆయా హీరోల ఫంక్షన్ లకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు అది ప్రాక్టికల్గా చేస్తూ ఉండడంతో మెగా అభిమానులకు ఇది మింగుడు పడడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: