ఇక కీర్తి సురేష్ కాస్త కుదట పడగానే ఆమె వీడియో ద్వారా ఫ్యాన్స్ పలకరించనున్నారని సమాచారం. మహేష్ బాబుతో కలసి 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ కి హీరో మహేష్ కారణం గానే కరోనా సోకి ఉంటుందని తెలుస్తోంది. దుబాయ్ నుండి వచ్చిన ప్రిన్స్ కు మొదట కరోనా పాజిటివ్ అని తేలిన ఆ తరువాత కీర్తి సురేష్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఈ సినిమా వర్క్ లో మహేష్ తో క్లోజ్ గా మూవ్ అయిన వారందరికీ కరోనా భయం పట్టుకుందట.
ఎంతైనా అది వైరస్ మనతో ఉన్న వారికి కోవిడ్ వచ్చింది అంటే మనకు కూడా వస్తుందో అన్న టెన్షన్ సహజమే కదా. అయితే ఇప్పుడు ఈ కారణంగా సర్కారు వారి పాట సినిమా కూడా వాయిదా పడింది. కరోనా మహమ్మారి వలన చాలా మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు ఈ కరోనా నుండి మనకు శాంతి లభిస్తుందో తెలియడం లేధు. త్వరలోనే కీర్తి సురేష్ మరియు మహేష్ బాబు లు కోలుకోవాలని కోరుకుందాం.