సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది సరికొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు. అలా ఇప్పటి వరకు ఎంతో మంది రావడం జరిగింది. ఇక 2005 వ సంవత్సరం లోనే నటి పూనమ్ బజ్వా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత తెలుగులో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. ఆమెకు అంతగా అదృష్టం కలిసిరాలేదని చెప్పవచ్చు. నాగార్జున సరసన బాస్ వంటి సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలో కూడా ఈమె నటించింది. ఇక ఈ సినిమాతో కాస్త మంచి పేరును సంపాదించుకుంది. అయినా కూడా ఆ తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు.
దాంతో ఇక ఆ తర్వాత ఈమె చూపు తమిళ ఇండస్ట్రీ వైపు పడింది. కానీ అక్కడ కూడా అంతగా కలిసి రాలేదు. తమిళంలో హీరో జీవా సరసన సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఆదరణ లభించలేదు. ఇక ఆ తరువాత కన్నడ, మలయాళం వంటి భాషలలో కూడా నటించింది పూనమ్.
 అక్కడ కూడా పెద్దగా కలిసి రాలేదు. అయినప్పటికీ మలయాళం లో స్టార్ హీరోలు అయినటువంటి మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి సరసన నటించింది.తమిళంలో కొన్ని సినిమాలలో హాట్ గా నటించడంతో ఈమెకు అక్కడ మంచి మార్కులే పడ్డాయి. దీంతో అక్కడ ఈ అమ్మడికి అన్ని అలాంటి పాత్రలే రావడం మొదలయ్యాయి. తాజాగా ఇటీవలె పెళ్లిపీటలు ఎక్కింది పూనమ్.
అయితే ప్రస్తుతం ఈమె ప్రెస్టీజియస్ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని అయినా ఈ ముద్దుగుమ్మ సరిగ్గా ఉపయోగించుకుంటే సినీ అవకాశాలు వెలువడుతాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈమె అన్ని భాషలలో నటించినప్పటికీ ఎక్కడా కూడా ఈమె హీరోయిన్ గా రాణించలేకపోయింది. ఏదిఏమైనా హీరోయిన్ గా ఎదగాలంటే కాస్త అదృష్టం కూడా ఉండాలని ఈ హీరోయిన్ ని చూస్తే మనకు అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: