నిధి అగ‌ర్వాల్‌.. ఈ అందాల భామ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అక్కినేని నాగ చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన `సవ్యసాచి` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ బ్యూటీ.. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రూపొందించిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా త‌ర్వాత తెలుగుతో పాటు త‌మిళ భాష నుంచి సైతం అవ‌కాశాలు అందుకుంటున్న నిధి ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జోడీగా క్రిష్‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` చిత్రంలో న‌టిస్తోంది.

అలాగే ఈమె న‌టించిన `హీరో` చిత్రం విడుద‌ల‌కు ముస్తాబైంది. అశోక్‌ గల్లా హీరోగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని కృష్ణ, గల్లా అరుణ కుమారి సమర్పణలో గల్లా పద్మావతి నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి పండ‌గ కానుక‌గా జ‌న‌వ‌రి 15న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసేందుకు జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిధి అగ‌ర్వాల్‌.. సినిమా గురించి ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకుంది. సంక్రాంతికి హీరో పర్‌ఫెక్ట్‌ మూవీ అని, ఇది ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసింది.

అలాగే ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులో ఉన్న భారీ కోరిక‌ను సైతం బ‌య‌ట పెట్టేసింది. ఇంత‌కీ నిధి ఏం చెప్పిందంటే.. త‌న‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాల‌నుంది అంటూ చెప్పేసింది. ఇంకేముంది పాన్ ఇండియా హీరోలుగా మార‌బోతున్న తార‌క్‌, చ‌ర‌ణ్‌, బ‌న్నీల‌పై క‌న్నేయ‌డంతో.. నిధి మామూల్ది కాదు, భారీ ఆశ‌లే పెట్టుకుందిగా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: