టాలీవుడ్ యువ నటుల్లో ఒకరైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలిసారిగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శ్రీను సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకి హీరోగా పరిచయం అయ్యారు. తండ్రి బెల్లంకొండ సురేష్ ఆశీర్వాదంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ తొలి సినిమాతో మంచి విజయాన్నే అందుకున్నారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

ఇక అక్కడి నుండి వరుసగా ఒక్కొక్కటిగా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ లు తన ఖాతాలో వేసుకుంటూ ఆడియన్స్ మనసు గెలుచుకుంటూ కొనసాగుతున్న బెల్లంకొండా శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ ఒక సినిమా చేస్తున్నారు. వినాయక్ తీస్తున్న ఈ సినిమా కొన్నేళ్ల క్రితం రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలున్నాయి. ఇక మరోవైపు సాయి శ్రీనివాస్ నటించిన పలు  సినిమాలు అటు హిందీలో సైతం యూట్యూబ్ లో అదరగొట్టే వ్యూస్ దక్కించుకుంటూ ఉండడం విశేషం.

ఇటీవల ఆయన నటించిన జయ జానకి నాయక సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్ లో అదరగొట్టగా, లేటెస్ట్ గా అల్లుడు శ్రీను మూవీ మాహాబలి పేరుతో డబ్ కాబడి యూట్యూబ్ లో ఏకంగా 200 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుని రికార్డు నెలకొల్పింది. దీనితో అల్లుడు శ్రీను యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఇటు తెలుగు తో పాటు అటు హిందీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం చేస్తున్న ఛత్రపతి రీమేక్ తో తప్పకుండా అక్కడ భారీ సక్సెస్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి బెల్లంబాబు అక్కడ ఫస్ట్ టైం చేస్తున్న సినిమాతో ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: