టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర కథానాయికగా కొనసాగుతుంది పూజా హెగ్డే. తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ అంతకు ముందు వరుస ప్లాపులతో సతమతం అవుతూ ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా సినిమాలేవీ లేకపోయినా కూడా తన స్టార్డమ్ ను కొనసాగిస్తూనే ఉంది అంటే తెలుగులో హీరోయిన్ల కొరత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక లైలా కోసం సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది పూజా హెగ్డే.

ఆ తర్వాత చేసిన ముకుంద సినిమా కూడా ఫ్లాప్ కావడంతో తెలుగులో తనకు వర్కవుట్ కాదేమో అనుకుని బాలీవుడ్ కి వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ పెద్ద హీరోలతో నటించి మంచి గుర్తింపు వచ్చాక తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడ సక్సెస్ అయ్యి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. ఇతర కుర్ర హీరోయిన్ లు ఎంత మంది వచ్చినా కూడా తనకు సాటి రాదు అన్నట్లుగా పూజ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా అవకాశాలు లేకపోయినా తన గత సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆమె కు క్రేజ్ ఇప్పుడు బాగా పనికొస్తుంది.

భవిష్యత్తులో టాలీవుడ్ లో రాబోయే సినిమాలలో ఆమెను ఎంచుకుంటున్నారని చెప్పవచ్చు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా చేస్తోంది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ అంటున్నారు. మరి ఇప్పటి వరకు వీటి గురించి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు కానీ పూజా హెగ్డే తొందరగా సినిమాలను ఎంచుకొక పోతే మాత్రం ఆమెకు చాలా ప్రమాదం అంటున్నారు ఆమె అభిమానులు. పాన్ ఇండియా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్న మన హీరోలు హీరోయిన్లను కూడా పాన్ ఇండియా రేంజ్లో ఇమేజ్ వున్న వాళ్ళ ఎంచుకుంటున్న నేపథ్యంలో పూజా హెగ్డే ను ఎక్కడ పక్కన పెట్టేస్తారు అన్న టెన్షన్ ఇప్పుడు అందరిలో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: