ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చింది అంటే స్టార్ హీరోలు అంతా తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తలపడడానికి ఆసక్తి చూపుతూ ఉండేవారు. కానీ ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితి కనబడడం లేదు. ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి కొంత కాలం క్రితం వరకు ఆసక్తి చూపించారు. అందులో భాగంగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 

 ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాను జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఈ సినిమాతో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమాను  జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇలా ఒకదాని వెనుక మరొక స్టార్ హీరోల సినిమాలు చూడొచ్చు అని జనాలు ఎంతో ఆతృతగా సంక్రాంతి కోసం ఎదురు చూశారు. అయితే ముందుగా సర్కారు వారి పాట సినిమాను చిత్ర బృందం సంక్రాంతి బరి నుండి తప్పించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది.  చివరకు ఆర్ఆర్ఆర్, రాదే శ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు అయిన విడుదల అవుతాయేమోనని జనాలు ఆశించారు. కాకపోతే చివరగా దేశంలో కరోనా విజృంభించడంతో ఈ రెండు సినిమాలు కూడా వాయిదా పడిపోయాయి. ఇలా ప్రస్తుతం ఒక బంగార్రాజు సినిమా మినహాయిస్తే ఏ స్టార్ హీరో సినిమా కూడా ఈ సంక్రాంతికి విడుదల అవడం లేదు. ఇలా స్టార్ హీరోల సినిమాలను థియేటర్ లలో చూద్దాము అనుకున్న ప్రేక్షకులకు ఈ సంవత్సరం సంక్రాంతి నిరాశనే మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: