'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు.ఇక అమ్మాయిల్లో కూడా ఈ మెగా హీరోకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.ఈమధ్యనే 'కొండపొలం' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కమర్షియల్ గా అంతగా వర్కవుట్ కాకపోయినా.. విమర్శకుల ప్రశంసలు మాత్రం సినిమాకి దక్కాయి. ఇప్పుడు ఈ మెగా హీరో మంచి జోరు మీదున్నాడనే చెప్పాలి.వరుసగా సినిమాలను అనౌన్స్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇక ఇప్పటికే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి 'రంగ రంగ వైభవంగా', 'ఆబాల గోపాలం' అనే టైటిల్స్ కూడా పరిశీలిస్తున్నారని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ రోజు ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ అనేది రానుంది.అలాగే ఇదిలా ఉండగా.. ఈరోజు వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నాల్గో సినిమాను కూడా అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. అయితే దర్శకుడిగా కాదండోయ్.. త్రివిక్రమ్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.దీనికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసి వైష్ణవ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ.. సినిమాను కూడా అనౌన్స్ చేశారు. దర్శకుడు ఎవరనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలపనున్నారు. ఇక త్రివిక్రమ్ నిర్మిస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా సినిమాలో ఆయన హ్యాండ్ పడుతుంది. కాబట్టి సినిమా రికార్డు స్థాయిలో హిట్టు అవ్వడం ఖాయమని వైష్ణవ్ చాలా నమ్మకంగా వున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: