అగ్ర దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇప్పుడు టాలీవుడ్ లో మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు త్రివిక్రమ్. అభిరుచి గల దర్శకుడిగా తన కెరీర్ ను కొనసాగిస్తూ రచయితగా కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ దర్శకుడు ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని చిత్రాలను నిర్మించి తన ప్రత్యేకతను చాటుకున్న మాటల మాంత్రికుడు భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేసే విధంగా ముందుకు సాగుతున్నాడు. తొలుత రచయితగా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ ఆ తర్వాత తన రచనా బలంతో దర్శకుడిగా ఎదిగారు.

టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్క హీరో కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఎదురు చూసే వారే. ఒక్కసారి కాదు ఈ దర్శకుడితో ఎన్నిసార్లు సినిమా చేసిన తనివితీరదు అని సదరు హీరోలు చెబుతుండడం త్రివిక్రమ్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అనడానికి నిదర్శనం. ఏది ఏమైనా త్రివిక్రమ్ దర్శకుడిగానే కాకుండా ఇప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తుండడం కొంతమంది యువ హీరోలను ఎంతగానో సంతోషపెడుతుంది. దానికి కారణం ఈ హీరోతో పని చేయాలి అంటే తప్పకుండా స్టార్ అయ్యి ఉండాలి. అలా అవడానికి చాలా రోజులు పడుతుంది. ఈలోపు త్రివిక్రమ్ తో సినిమా చేయాలనే కోరిక అలాగే ఉండిపోతుంది. 

ఆ నేపథ్యంలో త్రివిక్రమ్ తో సినిమా చేయాలని చాలామంది హీరోల కోరిక అలాగే ఉంటుంది. అలాంటి వారికి ఇప్పుడు సరికొత్త అవకాశం కల్పిస్తూ త్రివిక్రమ్ నిర్మాతగా అవతారం ఎత్తి కొత్త, యువ హీరోలతో సినిమాలు చేస్తూ వారి కోరికలను తీరుస్తున్నాడు. తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించ పోతున్నాడు. ఆయన మూడవ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న గా దీనిలో త్రివిక్రమ్ కూడా నిర్మాతగా భాగస్వామి కావడం విశేషం. ఈ చిత్రం మాత్రమే కాకుండా ధనుష్ హీరోగా నటించబోయే సినిమాకి కూడా త్రివిక్రమ్ నిర్మాత గా చేస్తున్నాడు. చూడబోతే నిర్మాతగా తన దైన జోష్ ను చూపిస్తున్నాడు అనిపిస్తుంది త్రివిక్రమ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: