రన్ రాజా రన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు సుజిత్. ఈ సినిమా సక్సెస్ సాధించిన తరువాత పెద్ద హీరోల కళ్ళలో పడి వారితో సినిమాలు చేసుకునే విధంగా ప్రణాళికలు రచించగా చివరకు ప్రభాస్ తో సాహో అనే సినిమా చేశాడు సుజిత్. ఈ చిత్రం విడుదలైన తర్వాత సుజిత్ మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అని చెప్పాలి. కమర్షియల్ గా ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా టెక్నికల్ పరంగా కథా కథనాల పరంగా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది ఈ సినిమా.

అయితే అనూహ్యంగా ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకు వచ్చిన కూడా సుజిత్ కి ఇంకా సినిమా అవకాశాలు రాకపోవడం పట్ల ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశలో ఉన్నారు అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి సినిమా చేసే విధంగా ఛాన్స్ అందుకోగా అది మధ్యలోనే క్యాన్సిల్ అయింది. మరొక దర్శకుడితో చిరు ముందుకు పోగా సుజీత్ మళ్లీ ఖాళీ అయిన్నట్లు అయింది. దీంతో ఈ దర్శకుడు బాలీవుడ్ లో సినిమా చేసే విధంగా రంగం సిద్ధం చేసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ దర్శకుడు ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే అనుమానాలు బాగానే రేకెత్తాయి.

తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేయబోయే ఒక సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చత్రపతి రీమేక్ సినిమాను బాలీవుడ్ లో చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తర్వాత చేయబోయే తెలుగు సినిమా కోసం సుజిత్ తో మంతనాలు చేయగా ఓ మంచి కథ ఆయనకు వినిపించారని తొందర్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. సాహో సినిమా వచ్చి మూడు సంవత్సరాలు దాటిన నేపథ్యంలో ఈ దర్శకుడు ఇంతవరకు సినిమాను చేయకపోవడం ఆయన అభిమానులను తీవ్ర నిరాశ కలిగిస్తుంది. తొందరగా ఈ సినిమా ప్రకటన ఇస్తే బాగుంటుంది అనేది వారి ఆలోచన. 

మరింత సమాచారం తెలుసుకోండి: