వాస్తవానికి బాలీవుడ్ సినిమా పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద సినిమా పరిశ్రమ. అక్కడ హీరోగా చేయాలని సినిమా లకు సంబంధించిన ప్రతి హీరో కూడా అనుకుంటాడు. ప్రతి ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉన్న హీరోయిన్ కూడా అక్కడ చేయాలని భావిస్తూ ఉంటుంది. అలా సౌత్ సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది హీరోలు బాలీవుడ్ లో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి కొంతమంది హీరోలు వెళ్లి బాలీవుడ్ లో తమ సత్తా చాటుతోన్నారు.  

అలా సౌత్ సినిమా పరిశ్రమ నుంచి మరికొంత మంది హీరోలు కూడా వెళ్లి అక్కడ తమ సత్తా చాటాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. మలయాళం సినిమా పరిశ్రమ నుంచి హీరోగా వచ్చి సౌత్ లోనే క్రేజీ హీరోగా మారాడు దుల్కర్ సల్మాన్. ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. నటుడిగా తనను తాను ఎప్పుడో నిరూపించుకున్న ఈ హీరో ఇటీవలే మంచి మంచి సక్సెస్ ను అందుకుని భారీ స్థాయిలో క్రేజ్ అందుకుని ఇప్పుడు బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి ముందుకు రాబోతున్నాడు.

ఇక అదే మలయాళ సినిమా పరిశ్రమ నుంచి ఇటీవలే మిన్నాల్ మురళి అనే సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో టివినో థామస్. ఆయన కూడా బాలీవుడ్లో తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మిన్నాల్ మురళి సినిమాతో తనేంటో నిరూపించుకున్నాడు. తొందర్లోనే మరో భారీ సినిమాతో అక్కడ తన సత్తా చాటనున్నాడు. ఇక టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో తన సత్తా చాటే విధంగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా చేస్తున్న లైగర్ చిత్రం బాలీవుడ్ లో భారీ స్థాయిలో విడుదల అవుతుంది. ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమా తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: