ఇక చలో సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన కూడా ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తుంది. ఈమెకు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి అంటే మామూలు విషయం కాదు. అక్కడ అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద హీరోలతో కలిసి నటిస్తూ తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవలే ఆమె పుష్ప సినిమాలో నటించిన తీరుకు బాలీవుడ్ ప్రేక్షకులు లోకం దాసోహం అయ్యింది.
అయితే వీరిద్దరి తర్వాత ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ గా ఎదిగిన వారు దరిదాపుల్లో కనపడకపోవడం ఇప్పుడు సినిమా విశ్లేషకులను ఎంతగానో కలవరపెడుతుంది. కృతిశెట్టీ, శ్రీ లీల వంటి హీరోయిన్లు కొంతమంది పెద్ద హీరోల సరసన నటించే విధంగా ముందుకు దూసుకుపోతు ఉండగా వారికి కొంత సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు స్టార్ హీరో హీరోయిన్ లు ఎవరు లేరని వారు తేల్చి చెబుతున్నారు. కొన్ని సంవత్సరాలు ఈ ఇద్దరు హీరోయిన్లు పెద్ద హీరోయిన్లు గా కొనసాగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ఇద్దరు హీరోయిన్లు గా అగ్రహీరోయిన్ లుగా ఎన్ని సంవత్సరాలు ఉంటారో చూడాలి.