ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `అత్తారింటికి దారేది`. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీ.వీ.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో స‌మంత‌, ప్ర‌ణీత హీరోయిన్లుగా న‌టించ‌గా.. న‌దియా, రావు ర‌మేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం స‌మ‌కూర్చారు.

2013 సెప్టెంబరు 27న విడుద‌లైన ఈ చిత్రం అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం అని చెప్పుకొచ్చు. ఎందుకంటే.. విడుద‌ల‌కు ముందే సినిమాపై పైరసీ దెబ్బ ప‌డింది. దీంతో స‌గం సినిమా సోష‌ల్ మీడియాలో లీక్ అయిపోయింది. అయిన‌ప్ప‌టికీ ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టి బీభ‌త్సం సృష్టించింది. ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ తొలిసారి ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు,

ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌న.. దేవీశ్రీ ప్రసాద్ అందించిన స్వ‌రాలు.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ టేకింగ్‌.. అత్త సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలు ఆక‌ట్టుకున్నాయి. అందుకే నెట్టింట లీకైనా ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ రథం ప‌ట్టారు. అయితే లాంగ్ ర‌న్‌లో ఏకంగా రూ. 77 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం తమిళ భాష‌లో మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది.

అత్తారింటికి దారేది సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ఆ మూవీ రీమేక్ రైట్స్‌ను కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఆపై స్టార్ హీరో శింబుతో  లైకా సంస్థ రూ. 35 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించింది. సి. సుంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా న‌టించారు. కానీ, భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన‌ ఈ సినిమా  రూ.9 కోట్ల షేర్ మాత్రమే రాబ‌ట్టి ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా త‌మిళంలో ఫ్లాప్ అవ్వ‌డంతో శింపు ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు ప‌వ‌న్ ఫ్యాన్స్ సైతం నిరాశ చెందారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: