అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన, నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని సాధించడంతో పాటు కలెక్షన్ ల వర్షం కురిపించింది, అలాగే ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో రష్మిక మందన కు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన పుష్ప పార్ట్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే, పుష్ప పార్ట్ వన్ సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప పార్ట్ టు సినిమాపై పడింది,  అయితే తాజాగా రష్మిక మందన పుష్ప పార్ట్ టు పై సోషల్ మీడియా ద్వారా కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.

సోషల్ మీడియాలో త‌న లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేసిన ఈ చిన్న‌ది.. ‘పుష్ప సినిమా పట్ల మీరు చూపిన ఆదరణ, ప్రేమకు ధన్యవాదాలు. ఈ ప్రేమ మమ్మల్ని ఇంకా కష్టపడి పని చేసేలా చేస్తుంది, పుష్ప పార్ట్ టు చాలా గొప్పగా, అద్భుతంగా ఉంటుందని నేను వాగ్దానం చేస్తున్నాను అని రష్మిక మందన సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి, ఇలా రష్మిక మందన పుష్ప పార్ట్ టు సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఈ సినిమాపై జనాలలో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇది ఇలా ఉంటే రష్మిక మందన ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: