వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న మహేష్ బాబు పుకిరితో బిగ్ హిట్ అందుకుని.. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇలియానాల కెరీర్కు కూడా ఈ చిత్రం మంచి ప్లస్ అయింది. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగ రాసిన ఈ చిత్రం అప్పట్లోనే రూ.66 కోట్ల గ్రాస్, రూ.44కోట్లు షేర్ వసూలు చేసి అందరి చేత ఓరా అనిపించింది. అలాగే ఈ సినిమాకి మణిశర్మ అందించిన మ్యూజిక్ మరింత ఆకర్షణగా నిలిచింది.
ఇకపోతే ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో నటించాల్సి ఉంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్. అసలు ఏం జరిగిందంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పూరి జగన్నాథ్ అమితాబ్ బచ్చన్ను సంప్రదించారట. కానీ, ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా అమితాబ్ సున్నితంగా ఈ మూవీని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
అయితే పోకిరి మూవీలో మూడు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. అందులో ఒకటి నాజర్ పాత్ర, మరొకటి ప్రకాష్ రాజ్ పాత్ర, మూడవది సాయాజీ షిండే పాత్ర. మరి వీటిల్లో ఏ పాత్ర కోసం అమితాబ్ను సంప్రదించారు అన్నది మాత్రం బయటకి తెలీలేదు. ఒక వేళ అమితాబ్ బచ్చన్ కూడా ఇందులో నటించి ఉంటే పోకిరి చిత్రం మరో లెవల్కి వెళ్లేదని చెప్పొచ్చు.