టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న చిత్రం `పోకిరి`. గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. వైష్టో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పూరీ జగన్నాథ్‌లు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ 2006లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది.

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న మ‌హేష్ బాబు పుకిరితో బిగ్ హిట్ అందుకుని.. మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు. డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, ఇలియానాల కెరీర్‌కు కూడా ఈ చిత్రం మంచి ప్ల‌స్ అయింది. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిర‌గ రాసిన ఈ చిత్రం అప్పట్లోనే రూ.66 కోట్ల గ్రాస్, రూ.44కోట్లు షేర్ వసూలు చేసి అంద‌రి చేత ఓరా అనిపించింది. అలాగే ఈ సినిమాకి మణిశర్మ అందించిన‌ మ్యూజిక్ మ‌రింత ఆక‌ర్ష‌ణగా నిలిచింది.

ఇక‌పోతే ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో న‌టించాల్సి ఉంది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్. అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం పూరి జ‌గ‌న్నాథ్ అమితాబ్ బ‌చ్చ‌న్‌ను సంప్ర‌దించార‌ట‌. కానీ, ఇత‌ర ప్రాజెక్ట్స్ కార‌ణంగా అమితాబ్ సున్నితంగా ఈ మూవీని రిజెక్ట్ చేశార‌ని తెలుస్తోంది.

అయితే పోకిరి మూవీలో మూడు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. అందులో ఒకటి నాజర్ పాత్ర, మరొకటి ప్రకాష్ రాజ్ పాత్ర, మూడవది సాయాజీ షిండే పాత్ర. మ‌రి వీటిల్లో ఏ పాత్ర కోసం అమితాబ్‌ను సంప్ర‌దించారు అన్న‌ది మాత్రం బయటకి తెలీలేదు. ఒక వేళ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఇందులో న‌టించి ఉంటే పోకిరి చిత్రం మ‌రో లెవ‌ల్‌కి వెళ్లేద‌ని చెప్పొచ్చు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: