దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సంక్రాంతికి సినిమా విడుదల అవుతుందని ప్రకటించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఉవ్విళ్లూరారు. కానీ కరోనా పరిస్థితుల వల్ల మరోసారి సినిమా వాయిదా పడింది. మెగా, నందమూరి అగ్రహీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదటి సారి కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం వాళ్ల అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే సినిమా వాయిదా పడడంతో అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

 అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ రిలీజ్ పోస్ట్ పోన్ అయినా కూడా ఇంకా రికార్డ్స్ మాత్రం క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ రికార్డులే అటు నందమూరి ఇటు మెగా అభిమానులకు కాస్త ఊరటను కలిగిస్తున్నాయి. ఇక తాజాగా త్రిబుల్ ఆర్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దర్శక ధీరుడు రాజమౌళిసినిమా ట్రైలర్ ను మూడు నిమిషాలకు పైగా కట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు మిగతా అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఎంత గానో ఆకట్టుకుంది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ బాహుబలిని మించి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో కొత్త చరిత్ర సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇక తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ 50 మిలియన్ల వ్యూస్ అందుకొని.. టాలీవుడ్లోనే ఫాస్టెస్ట్ 50 మిలియన్ టైలర్ గా రికార్డులు క్రియేట్ చేసింది. అంటే కేవలం అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్ల వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా 'ఆర్ ఆర్ ఆర్' నిలిచింది. దీంతో అభిమానులు ఈ రికార్డుతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. సుమారు 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కూడా నటిస్తుండడంతో సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు ఉంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR