ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల్లో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఓ రేంజ్లో దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తన ప్రస్తుత సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయి లోనే చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. కోవిడ్ పరిస్థితులవల్ల వాయిదా పడింది. ఇప్పటికే ప్రభాస్ సినిమా షూటింగ్లు వాయిదాలతో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. ఇక మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకొని మళ్లీ షూటింగ్లు మొదలయ్యాయి.

ఇక వాటిలో ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తవగా.. సలార్ సినిమా షూటింగ్ మాత్రం చివరి దశలో ఉంది. అంతేకాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ కూడా ఇటీవల మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు మరిన్ని సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు ప్రభాస్. అయితే ఇవన్నీ కాస్త పక్కనపెడితే.. ప్రస్తుతం ప్రభాస్ మాత్రం అండర్ గ్రౌండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అదేంటి ప్రభాస్ ఎందుకు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు? ఇంతకు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? అని అనుకుంటున్నారా..

ప్రస్తుతం కోవిడ్ కారణంగా పలు పెద్ద సినిమాలకు అంతరాయం కలగడంతో హీరోలంతా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి.. ప్రస్తుత సమయాన్ని తన ఫ్యామిలీతో గడుపుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. దాంతో ప్రభాస్ ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లో ఉన్నాడని.. అక్కడే కొన్ని సినిమా కథలను కూడా వింటున్నాడని ఫిల్మ్ సర్కిల్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తరువాత ప్రభాస్ తన సినిమా షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఏదేమైనా ప్రభాస్ ఇప్పుడు  సినిమా షూటింగ్స్ తో పాటు ఫ్యామిలీ నుంచి కూడా దూరంగా అండర్ గ్రౌండ్ లో ఉండడం ఇండస్ట్రీలోనే చర్చనీయాంశంగా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: