ఇటీవల బంగార్రాజు సినిమా మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో నాగచైతన్య, దక్షా నగర్కార్ ఇద్దరికి సంబంధించిన ఓ చిలిపి వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. నాగార్జున స్పీచ్ ఇస్తున్న సమయంలో చైతు వెనక్కి తిరిగి చూడగా పక్కనే ఉన్న దక్ష నగార్కర్ తను కనుబొమ్మలు ఎగుర వేసింది. దాంతో వెంటనే చైతూ సిగ్గుపడిపోయాడు. ఇక ఈ వీడియో అన్ని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ముఖ్యంగా మీమర్స్ అయితే ఈ వీడియో పై ఎన్నో మీన్స్ క్రియేట్ చేశారు. రకరకాల మీమ్స్, ట్రోల్స్ తో చైతు ని ఒక ఆట ఆడేసుకున్నారు.ఇక తాజాగా ఈ చిలిపి మీడియాపై బంగార్రాజు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్పందించారు.

ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడుతూ చైతు స్వభావం గురించి చెప్పుకొచ్చాడు. చైతూలో ఉన్న క్లారిటీ 10% ఉంటే హ్యాపీగా బతికేయొచ్చని.. చైతూని అందరూ బంగారం అని ఎందుకంటారో అతనితో పనిచేశాక తెలిసిందన్నారు. నాలుగేళ్ల క్రితం ఆయనతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకి పని చేశానని.. ఇప్పుడు మళ్ళీ బంగార్రాజు చేశానని.. ఈ నాలుగేళ్ళలో అతనిలో చాలా మార్పులొచ్చాయని.. ముఖ్యంగా అతను మాట్లాడే పద్ధతి,నటన,మెచ్యూరిటీలో మార్పులు వచ్చాయని చెప్పారు చైతు సైలెంట్ అని అనిపిస్తుందని..కానీ అంత సైలెంట్ అయితే కాదని అన్నారు.

మొన్న జరిగిన ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతున్న సమయంలో ఏదో సౌండ్ అయిందని.. చైతూ వెనక్కి తిరిగిచూసాడని.. అలా వెనక్కి తిరిగడంతో దక్ష కళ్ళు ఎగరేసిందని.. దాంతో నాగ చైతన్య సిగ్గు పడ్డాడని చెప్పుకొచ్చాడు కళ్యాణ్ కృష్ణ. ఆయన సిగ్గు పడటం కామన్ అని ఆయన ఎవరిని చూసినా అలానే నవ్వుతాడని.. అదంతా ఆమె వల్లే జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని అందుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: