అందాల ముద్దుగుమ్మ అను ఇమాన్యుయల్, నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో అను ఇమాన్యుల్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా అను ఇమాన్యుల్ టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది, కాకపోతే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో అవకాశాలు కూడా చాలావరకు తగ్గాయి.  

అయితే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన మహా సముద్రం సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని తెచ్చి పెట్టలేదు. అయితే ఇలా వరుస అపజయాలతో డీలా పడిపోయిన అను ఇమ్మానియేల్ లకు తాజాగా ఒక కేజీ సినిమా అవకాశం దక్కింది, ఇప్పటికే క్రాక్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమా లో అనూ ఇమాన్యుల్ ఒక ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది, తాజాగా జరిగిన ఈ సినిమా లాంచ్ ఈవెంట్ కు ఈ ముద్దుగుమ్మ హాజరయ్యింది, అలాగే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్ లు నటించబోతున్నట్లు తెలుస్తోంది, అందులో దక్ష నగర్కార్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇలా రవితేజ సరసన క్రేజీ సినిమాలో నటించే అవకాశాన్ని అను ఇమాన్యుల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: