తెలుగు సినిమాలతో పాటు పాలు హిందీ సినిమాలలో యాక్టింగ్ చేసిన హీరో సచిన్ జోషి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తాజాగా ఈ యువ హీరో మీద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ భారీ షాక్ ఇచ్చింది. లోన్ ఫ్రాడ్ కేసులో మనీలాండరింగ్ కేస్ కింద తన ఆస్తిని జప్తు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా నిన్నటి రోజున ఈ హీరో నుండి 410 కోట్ల రూపాయల ఆస్తిని జప్తు చేశారట. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు కూడా..330 కోట్ల విలువైన ప్లాట్లు ఉన్నట్లు సమాచారం. ఇక మిగిలిన 20 కోట్ల ఆస్తి సచిన్ జోషి కి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవిగా అధికారులు వెల్లడించారు.


యువ హీరో  గుట్కా, పాన్ మసాలా తయారు చేసేటటువంటి..jmj గ్రూప్ ప్రమోటర్ వ్యాపారవేత్త అయిన..JM. జోషి కుమారుడు. అంతేకాకుండా ఈ హీరో కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ముంబైలో ఒక స్లమ్ ఏరియాలో ఉండే ఒక ప్రాజెక్టులో వీరు అక్రమాలకు పాల్పడ్డారని ఒక ప్రముఖ వ్యాపారవేత్త కేసు వేయడంతో దీనిపై.. ఎన్ఫోర్సుమెంట్ హారిక అధికారులు కేసును దర్యాప్తు చేపట్టారు.. ఇక ఆ ప్రాజెక్టు 2016 లో లబ్దిదారుల సంఖ్య క్రమంగా పెరిగారని.. అలాగే ఒక్కో ప్లాట్ విలువ..2.5 కోట్ల రూపాయల నుంచి నాలుగు కోట్ల వరకు అధికారులు పెంచినట్లు గా ఈడీ నివేదికలో తెలియజేసింది.

ఇక తిరిగి మరి అక్రమ పత్రాలను సృష్టించి ఆ ఏరియా అని మళ్లీ అభివృద్ధి చేస్తున్నామని చెప్పి బ్యాంకు నుండి..410 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నట్లుగా అందులో తేలిందట. అలాగే ఔరంగాబాద్ లో ఉన్న ఓంకార్ గ్రూపును మేనేజ్మెంట్ డైరెక్టర్ బాబుల్ శర్మ, చైర్మన్ కమల్ ఫైవ్ కూడా కేసు నమోదు కావడం జరిగింది. దీని ద్వారానే సెంట్రల్ ఏజెన్సీ వారు దర్యాప్తు చేపట్టడం జరిగిందట. ఇక వీరందరి పై గత సంవత్సరం జనవరి నెలలోనే వీడియో అధికారులు దాడి చేసినట్లుగా తెలియజేశారు. అలాగే గత సంవత్సరం తాత్కాలిక బెయిలు కూడా మంజూరు చేయడం జరిగిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: